‘కేజీఎఫ్ 2’ తర్వాత ఎప్పుడెప్పుడు కొత్త సినిమా ప్రకటిస్తాడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు శుక్రవారం గుడ్ న్యూస్ చెప్పాడు యశ్. తన 19వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను ఇచ్చాడు. ‘టాక్సిక్’ టైటిల్తో ఈ చిత్రం తెరకెక్కనుందని అనౌన్స్మెంట్ వచ్చింది. ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనేది ట్యాగ్లైన్. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని కె వెంకట్ నారాయణతో పాటు యశ్ నిర్మిస్తున్నాడు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ఏప్రిల్ 10, 2025న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ ‘కథను సరికొత్తగా చెప్పాలని నేనెప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాను. అలాంటి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ సినిమా. రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా కథ ఉంటుంది. యశ్ ఒక అద్భుతమైన వ్యక్తి. అతనితో కలిసి ఈ మ్యాజికల్ జర్నీని చేయటానికి వెయిట్ చేస్తున్నా’ అన్నారు. ఇది తమకెంతో ప్రతిష్టాత్మకమైన చిత్రమని నిర్మాత వెంకట్ నారాయణ చెప్పారు.