ప్రభుత్వ నిర్ణయంపై బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ హర్షం

ప్రభుత్వ నిర్ణయంపై బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ హర్షం

హైదరాబాద్  :  న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అర్థరాత్రి ఒంటి గంట వరకు బార్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించడాన్ని  జీహెచ్ఎంసీ బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ స్వాగతించింది. మద్యం అమ్మకాలకు సహకరిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. అయితే సమయాన్ని మరో గంట పెంచితే బాగుండేదని అభిప్రాయపడింది. వైన్ షాపులకు అర్థరాత్రి 1గంట వరకు, బార్లకు 2గంటల వరకు పర్మిషన్ ఇవ్వాలని కోరింది. కరోనా కారణంగా రెండేళ్లుగా లిక్కర్ అమ్మకాలు సరిగా జరగలేదని ప్రస్తుతం కొనుగోళ్లు పెరిగాయని ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైందని చెప్పింది.