జనం ఇబ్బందిపడుతుంటే పట్టించుకోలేదు.. 

జనం ఇబ్బందిపడుతుంటే పట్టించుకోలేదు.. 

హైదరాబాద్: వర్షాలకు రోడ్లపై గుంతలు పడి జనం ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ.. సీఎం వెళ్తున్నారని హడావుడిగా ప్యాచ్ వర్క్ లు చేస్తోంది. నల్గొండ జిల్లా మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ వెళ్లే రూట్ లో రోడ్ల మీద గుంతలను జీహెచ్ఎంసీ మాన్ సూన్ సెంట్రల్ ఎమర్జెన్సీ టీమ్స్ హడావుడిగా పూడ్చి వేస్తున్నాయి. హడావుడిగా సాగుతున్న రోడ్ల మరమ్మత్తులు స్థానికులు, ఆ రూట్లో వెళ్లే వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాత్కాలిక మరమ్మతులు కాకుండా.. శాశ్వతంగా రోడ్లు బాగు చేయాలని జనం కోరుతున్నారు.