హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల లిస్టును ఎస్ఈసీ ప్రకటించింది. టీఆర్ఎస్ తరఫున పార్టీ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేయనున్నారు. బీజేపీ తరపున పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, సీనియర్ నేతలు మురళీధర్రావు, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్రావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, ఎంపీలు రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, అంజన్కుమార్ యాదవ్, వి.హన్మంతరావు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేపట్టనున్నారు.