హైదరాబాద్, వెలుగు : కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ సోమవారం రూ.57 కోట్లు రిలీజ్ చేసింది. కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశాలతో ఫైనాన్స్ విభాగం రూ.57కోట్ల పెండింగ్బిల్లులను రిలీజ్చేసింది. అయితే మొత్తం పెండింగ్బిల్లులు రిలీజ్చేయాలని, అప్పటివరకు పనులు చేయబోమని
కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మూడ్రోజులుగా పనులు బంద్చేసినందుకే రూ.57కోట్లు రిలీజ్చేశారని, ఇవి ఏ మాత్రం సరిపోవని చెప్పారు. పెండింగ్పెట్టిన రూ.1,350 కోట్లు రిలీజ్ చేయాలని డిమాండ్చేశారు.
