అనుపమ పరమేశ్వరన్ ట్వీట్ కు జీహెచ్ఎంసీ రిప్లై

అనుపమ పరమేశ్వరన్ ట్వీట్ కు జీహెచ్ఎంసీ రిప్లై

యూత్ ఫుల్ ప్రేమకథా చిత్రాలతో కెరీర్లో దూసుకుపోతూ.. ప్రేక్షకులకు కావల్సిన ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తోన్న మళయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్. సినిమాలు, షూటింగ్ లతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులకు మరింత చేరువవుతోంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ ఆసక్తికర ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెత్త, చెదారంతో పాటు ప్లాస్టిక్ కవర్లున్న గల్లీలు, అక్కడే ఉన్న ఆవులు కలిగిన కొన్ని పిక్స్ ను అనుపమ షేర్ చేశారు. ఈ ఫొటోలతో పాటు గుడ్ మార్నింగ్ అనే క్యాప్షన్ ను కూడా జతచేశారు.  అయితే అనుపమ చేసిన ఈ పోస్ట్ కు జీహెంఎంసీ రిప్లై ఇచ్చింది. మీరు షేర్ చేసిన ఫొటోలు ఏ ప్రాంతానికి చెందినవో చెప్పండి.. మా టీం వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తారు అంటూ ఇచ్చిన రియాక్షన్ కు నెటినజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తు్న్నారు. అంతే కాదు.. అనుపమ ఈ ఫొటోస్ కు గుడ్ మార్నింగ్ అని చేర్చడంపైనా కొందరు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఆ క్యాప్షన్ కి, ఆ ఫొటోస్ ఏంటీ అని కొందరంటే... ఆవులను సంరక్షించాలనే సందేశాన్నీ తెలుపుతున్నారు.