
నర్సింహులపేట, వెలుగు: బట్టలు ఆరేస్తుండగా కరెంట్షాక్తగిలి మహబూబాబాద్ జిల్లాలో తొమ్మిదో క్లాస్ స్టూడెంట్మృతి చెందింది. పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండలం లోక్యతండా అనుబంధ గ్రామమైన మూడవత్ తండాకు చెందిన మూడవత్ నవ్య(13) స్థానిక స్కూల్లో తొమ్మిదో క్లాస్చదువుతోంది. వారం రోజులుగా తండాకు కరెంట్సప్లై సరిగా లేకపోవడంతోపాటు, ఎర్త్అవుతుండడంతో గ్రామస్తులు రాత్రిళ్లు ట్రాన్స్ఫార్మర్ఆఫ్చేస్తున్నారు. శనివారం రాత్రి కూడా బంద్చేయగా ఆదివారం ఉదయాన్నే సర్పంచ్భర్త వెంకన్న వచ్చి ఆన్చేశాడు. కొద్దిసేపటి తర్వాత బాలిక నవ్య ఇంటి వద్ద బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. వారం నుంచి ట్రాన్స్ఫార్మర్బంద్చేసినా కరెంట్సప్లై అవుతోందని, లైన్ మన్ మంగిలాల్కు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.శనివారం రాత్రి బంద్చేసిన కరెంట్ సప్లైని సర్పంచ్ భర్త వెంకన్న ఆన్ చేయడంతోనే తమ బిడ్డ చనిపోయిందని మృతురాలి తండ్రి రవి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అలాగే లైన్ మన్ మంగిలాల్పై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.