
- టెక్బీ ప్రోగ్రామ్ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సీఎల్టెక్, హైదరాబాద్లోని ఇంటర్ స్టూడెంట్లకు తమ టెక్బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్లో శిక్షణ, ఇంటర్న్షిప్తో పాటు హెచ్సీఎల్లో పూర్తి స్థాయి ఉద్యోగం కూడా లభిస్తుందని తెలిపింది. స్టూడెంట్లు మొదట హెచ్సీఎల్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీఏటీ) లో అర్హత సాధించాలి. తర్వాత ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఈ ప్రోగ్రామ్ మొత్తం 12 నెలలు ఉంటుంది. దీనిలో చేరడానికి కొంత ఫీజు చెల్లించాలి. శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు దాదాపు రూ. 10 వేల స్టైపెండ్ లభిస్తుంది. ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి హెచ్సీఎల్లో ఐటీ సర్వీసెస్ అసోసియేట్ వంటి పోస్టులలో ఉద్యోగం లభిస్తుంది. ఈ ఉద్యోగంలో వార్షిక జీతం రూ. 1.7 లక్షల నుంచి రూ. 2.2 లక్షల వరకు ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్లో చేరిన వారికి బిట్స్ పిలానీ, ఎమిటీ యూనివర్సిటీ, శాస్త్ర యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థల నుంచి గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం కల్పిస్తామని హెచ్సీఎల్టెక్ సీనియర్ వైస్– ప్రెసిడెంట్ సుబ్బరామన్ అన్నారు.