హైదరాబాద్, వెలుగు : ఆసియా – పసిఫిక్ రీజియన్లో ఏడాదికి 1.5 కోట్ల నుంచి 2.5 కోట్ల మంది ప్యాసింజర్లను మేనేజ్ చేస్తున్న బెస్ట్ ఎయిర్పోర్టుల్లో జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్క్యూ) అవార్డ్ దక్కింది. కిందటేడాదికి గాను ఈ అవార్డ్ను గెలుచుకుంది. గ్లోబల్గా 400 ఎయిర్పోర్ట్లు పార్టిసిపేట్ చేశాయని, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మరోసారి ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషన్ (ఏసీఐ)
గుర్తింపు పొందిందని జీఎంఆర్ గ్రూప్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఉద్యోగుల హార్డ్వర్క్ వలనే ఈ గుర్తింపు పొందగలిగామని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫణికర్ అన్నారు. ఎయిర్పోర్ట్ విస్తరణకు సంబంధించి పనులన్ని పూర్తయ్యాయని, టెర్మినల్లో కొత్త ఫెసిలిటీస్ ఏర్పాటు చేశామని, గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరిచామన్నారు.
2018 లో ఏడాదికి 1.5 కోట్ల నుంచి 2.5 కోట్ల ప్యాసింజర్లను మేనేజ్ చేస్తున్న ఎయిర్పోర్టుల కేటగిరిలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు గ్లోబల్గా నాలుగో ర్యాంక్ దక్కింది. ఇదే కేటగిరిలో 2019, 2020, 2022 లో ఆసియా పసిఫిక్ రీజియన్లో బెస్ట్ ఎయిర్పోర్ట్గా (సైజ్ అండ్ రీజియన్) నిలిచింది.