గోవా మాజీ సీఎం ప్రతాప్ సింగ్ రాణేకు అరుదైన గౌరవం

గోవా మాజీ సీఎం ప్రతాప్ సింగ్ రాణేకు అరుదైన గౌరవం

గోవా మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణేకు అరుదైన గౌరవం లభించింది. ఆయనకు ఆ రాష్ట్ర కేబినెట్‎లో శాశ్వత హోదా కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాణే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున పొరియం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యంవహిస్తున్నారు. ప్రస్తుత తరుణంతో కలిపి ఆయన ఎమ్మెల్యేగా 50 ఏండ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా, స్పీకర్‎గా కూడా పనిచేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాణేకు కేబినెట్ హోదా ఇవ్వాలని గోవా సర్కార్ నిర్ణయించినట్లు ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఇక నుంచి ఎమ్మెల్యేగా 50 ఏండ్లు పూర్తిచేసుకొని, ముఖ్యమంత్రులుగా, స్పీకర్లుగా బాధ్యతలు నిర్వర్తించిన వారందరికీ కేబినెట్ లో శాశ్వత హోదా కల్పిస్తామని సీఎం సావంత్ తెలిపారు. రాణే 1987 నుంచి 2007 వరకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాణే 50 ఏండ్ల ప్రజాసేవను గుర్తించినందుకు గోవా సర్కార్‎కు ఆయన తనయుడు విశ్వజిత్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

For More News..

కీచక రాఘవ ఎక్కడ?

నీట్ పీజీ విద్యార్ధులకు సుప్రీంలో ఊరట