- టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం
- పైలట్ అప్రమత్తం… పాట్నాకి ఫ్లైట్ రిటన్
సాయంత్రం బిహార్ రాజధాని పాట్నా నుంచి హైదరాబాద్ రావాల్సిన గోఎయిర్ విమానం ఆకాశంలో ఉండగా మళ్లీ రిటన్ వెళ్లింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పైలట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులకు ఏ హాని కలగకుండా క్షేమంగా పాట్నా ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేశారు పైలట్.
మరో విమానంలో హైదరాబాద్ కు..
విమానంలో సాంకేతిక లోపాన్ని సరిచేయడానికి చాలా సమయం పడుతుందని ఎయిర్ పోర్టు అధికారులు తేల్చారు. దీంతో అందులోని 146 మంది ప్రయాణికులను మరో ఫ్లైట్ లోకి హైదరాబాద్ పంపారు.