
గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ ఇబ్లూ ఫియో పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ను రూ. 99,999 ( ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. ఇందులోని 2.52 కిలోవాట్ అవసర్ బ్యాటరీ ప్యాక్ను చార్జ్ చేస్తే 110 కిలోమీటర్లు వెళ్తుంది. మ్యాగ్జిమమ్ స్పీడ్ 60 కిలోమీటర్లు. ఈనెల15న బుకింగ్లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఆగస్టు 23 నుండి ప్రారంభమవుతాయి. గోదావరి ఎబ్లూ ఫీయోలో ఎకానమీ, నార్మల్, పవర్ మోడ్స్ ఉంటాయి. ఇందులో రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. పూర్తిగా చార్జ్ చేయడానికి 5 గంటల 25 నిమిషాలు పడుతుంది.