
హైదరాబాద్, వెలుగు: గోద్రెజ్ ఆగ్రోవెట్ మొక్కజొన్న పంట కోసం కొత్త హెర్బిసైడ్ 'అషితాకా'ను ప్రారంభించింది. ఈ కొత్త ఉత్పత్తిని జపాన్ కంపెనీ ఐఎస్కే సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది గడ్డి, కలుపు మొక్కలను తొలగిస్తుంది. తెలంగాణలో ఇది అక్టోబరు నుంచి అందుబాటులో ఉంటుందని హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో గోద్రెజ్ ఆగ్రోవెట్ సీఈవో (క్రాప్ ప్రొటెక్షన్) రాజావేలు తెలిపారు.
50 మిల్లీలీటర్ల అషితాకా బాటిల్ధర రూ.1,800 అని, ఇది ఎకరానికి సరిపోతుందని తెలిపారు. కలుపు మొక్కలు 2–-4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ హెర్బిసైడ్ బాగా పనిచేస్తుందన్నారు. తెలంగాణలో తమకు ఆరు వేల వరకు రిటైలర్లు ఉన్నారని, ఈ రబీ సీజన్లో లక్ష ఎకరాలకు దీనిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.