
Gold Price Today: అమెరికా చెప్పినా పట్టించుకోకుండా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దూకుడు వైఖరి ప్రపంచ యుద్ధ దిశగా నడిపిస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో గోల్డ్ రేట్లు మెల్లగా పెరుగుదలను చూస్తుండగా.. వెండి ధరలు మాత్రం వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశీయ కొనుగోలుదారులు ముందుగా షాపింగ్ చేసేందుకు అసలు పెరిగిన రేట్లను పరిశీలించటం ఉత్తమం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.వెయ్యి 500 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 265, ముంబైలో రూ.9వేల 265, దిల్లీలో రూ.9వేల 280, కలకత్తాలో రూ.9వేల 265, బెంగళూరులో రూ.9వేల 265, కేరళలో రూ.9వేల 265, పూణేలో రూ.9వేల 265, వడోదరలో రూ.9వేల 270, అహ్మదాబాదులో రూ.9వేల 270, జైపూరులో రూ.9వేల 280, మంగళూరులో రూ.9వేల 265, నాశిక్ లో రూ.9వేల 268, అయోధ్యలో రూ.9వేల 280, బళ్లారిలో రూ.9వేల 265, గురుగ్రాములో రూ.9వేల 280, నోయిడాలో రూ.9వేల 280 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.వెయ్యి 700 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 108, ముంబైలో రూ.10వేల 108, దిల్లీలో రూ.10వేల 121, కలకత్తాలో రూ.10వేల 108, బెంగళూరులో రూ.10వేల 108, కేరళలో రూ.10వేల 108, పూణేలో రూ.10వేల 108, వడోదరలో రూ.10వేల 097, అహ్మదాబాదులో రూ.10వేల 097, జైపూరులో రూ.10వేల 121, మంగళూరులో రూ.10వేల 108, నాశిక్ లో రూ.10వేల 111, అయోధ్యలో రూ.10వేల 121, బళ్లారిలో రూ.10వేల 108, గురుగ్రాములో రూ.10వేల 121, నోయిడాలో రూ.10వేల 121గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.88వేల 950 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.97వేల 040గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 10వేల 900 వద్ద ఉంది.