
Gold Price Today: ప్రస్తుతం గోల్డ్ రేట్లు ఒకరోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. దీంతో భారతీయ కొనుగోలుదారులు ఆందోళనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిపుణులు మాత్రం మరింత రేట్ల పతనం గురించి ఆలోచించటం కంటే ప్రస్తుత అంతర్జాతీయ అస్థిరతల్లో కొనుగోలుదారులు విచక్షణను ఉపయోగించి ముందుకు సాగాలని సూచిస్తున్నారు. దీంతో వివాహాది శుభకార్యాల కోసం షాపింగ్ చేస్తున్న ప్రజలు శనివారం వివిధ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను తప్పక పరిశీలించటం ముఖ్యం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5వేల భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 990, ముంబైలో రూ.8వేల 990, దిల్లీలో రూ.9వేల 005, కలకత్తాలో రూ.8వేల 990, బెంగళూరులో రూ.8వేల 990, కేరళలో రూ.8వేల 990, పూణేలో రూ.8వేల 990, వడోదరలో రూ.8వేల 995, జైపూరులో రూ.9వేల 005, లక్నోలో రూ.9వేల 005, మంగళూరులో రూ.8వేల 990, నాశిక్ లో రూ.8వేల 993, అయోధ్యలో రూ.9వేల 005, బళ్లారిలో రూ.8వేల 990, గురుగ్రాములో రూ.9వేల 005, నోయిడాలో రూ.9వేల 005గా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5వేల 500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధర గ్రాముకు చూస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 808, ముంబైలో రూ.9వేల 808, దిల్లీలో రూ.9వేల 823, కలకత్తాలో రూ.9వేల 808, బెంగళూరులో రూ.9వేల 808, కేరళలో రూ.9వేల 808, పూణేలో రూ.9వేల 808, వడోదరలో రూ.8వేల 995, జైపూరులో రూ.9వేల 813, లక్నోలో రూ.9వేల 005, మంగళూరులో రూ.9వేల 808, నాశిక్ లో రూ.9వేల 811, అయోధ్యలో రూ.9వేల 823, బళ్లారిలో రూ.9వేల 808, గురుగ్రాములో రూ.9వేల 823, నోయిడాలో రూ.9వేల 823గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల 990 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు రూ.9వేల 808గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష10వేల 900 వద్ద ఉంది.