
దేశంలో బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. వెండి, ప్లాటీనం రేట్లు దిగొచ్చాయి.10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 250 దిగొచ్చి.. రూ. 54,700కి చేరింది. గురువారం ఈ ధర రూ. 54,950గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,470గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 280 తగ్గి.. రూ. 59,670కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 59,950గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 5,967గా ఉంది.
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,690గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,850గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,820గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 59,670గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,050గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,050గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 54,700గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 59,690గాను ఉంది.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,750గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,720గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 54,700గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670గా ఉంది.
500 తగ్గిన వెండి ధర ..
దేశంలో వెండి ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ.7,300గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 500 తగ్గి.. రూ. 73,000కి చేరింది. గురువారం ఈ ధర రూ. 73,500గా ఉంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.76,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ.73,000.. బెంగళూరులో రూ. 72,250గా ఉంది.
ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.