ఉద్యోగులకు గుడ్ న్యూస్: 30 శాతం పీఆర్సీ

ఉద్యోగులకు గుడ్ న్యూస్: 30 శాతం పీఆర్సీ

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 30 శాతం ఫిట్ మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయన్నారు. దీంతో 9.17 లక్షల మందికి లబ్ధిచేకూర నుంది.

పీఆర్సీతో పాటు రిటైర్మెంట్ వయో పరిమితిని 61 ఏళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నామన్నారు. ఈ నిర్ణయం కూడా తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. అర్హులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లను ఇవ్వనున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్.

అంతేకాదు..టీచర్ల అంతర్ రాష్ట్ర ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యాపీలీ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రిలీవ్ ఇవ్వనున్నట్లు చెప్పారు .