ఇండియా గెలుపుపై పాక్ నెటిజన్కు గూగుల్ సీఈవో కౌంటర్

ఇండియా గెలుపుపై పాక్ నెటిజన్కు గూగుల్ సీఈవో కౌంటర్

పాకిస్థాన్పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. ‘‘ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి దీపావళి వేడుకలు సంతోషంగా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నా. నేను కూడా నిన్న జరిగిన మ్యాచ్లో చివరి 3 ఓవర్లను ఇవాళ మళ్లీ చూసి దీపావళి జరుపుకుంటున్నాను. అద్భుతమైన గేమ్.. టీమిండియా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది’’ అని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్కు పాకిస్థాన్కు చెందిన ఓ నెటిజన్ స్పందిస్తూ.. మీరు మొదటి మూడు ఓవర్లు చూడాల్సింది అంటూ టీమిండియా తడబడిన విషయాన్ని ప్రస్తావించారు.  దీనికి పిచాయ్ కౌంటర్ ఇస్తూ.. అది కూడా చూశా.. భువీ, అర్షదీప్ అద్భుతమైన బౌలింగ్ వేశారు అంటూ బదులిచ్చారు.

ఆ తర్వాత సదరు నెటిజన్ తాను టీమిండియా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతున్నానని మరో ట్వీట్ చేయగా..అప్పటికే నెటిజన్లు అతడికి చురకలు అంటించారు. అంత గొప్ప వ్యక్తి నీ ట్వీట్కు స్పందించడమే గొప్ప విషయం.. పిచాయ్ సర్ మీరూ సూపర్ అంటూ కామెంట్స్ చేశారు.