న్యూఢిల్లీ: గూగుల్ ప్లేస్టోర్లో యాప్స్కు సర్వీస్చార్జ్ చెల్లింపులపై ఏర్పడ్డ వివాదంపరిష్కారమయింది. తొలగించిన అన్ని యాప్లను తన ప్లే స్టోర్లో పునరుద్ధరించడానికి గూగుల్ అంగీకరించింది. గూగుల్, స్టార్టప్ మధ్య చర్చలు బాగా జరిగాయని, యాప్లను లిస్టింగ్ చేయడానికి గూగుల్ అంగీకరించిందని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
మ్యాట్రిమోనీ డాట్ కామ్, జాబ్ సెర్చ్ యాప్ నౌకరీ వంటి చాలా యాప్స్ను గూగుల్తీసేసింది. ప్రభుత్వం ఒత్తిడి కారణంగా శనివారం నుంచి కొన్ని యాప్లను పునరుద్ధరించింది. అవి 11–-25 శాతం చార్జ్చెల్లించడానికి అంగీకరించాయి.
