గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ.హర్ష డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. టీజర్, ఫస్ట్ సాంగ్తో ఆకట్టుకున్న టీమ్, బుధవారం సెకండ్ సాంగ్ను రిలీజ్ చేశారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ను సంతోష్ వెంకీ ఎనర్జిటిక్గా పాడాడు.
వీళ్లిద్దరూ కలిసి లిరిక్స్ కూడా రాశారు. ‘గల్లీ సౌండుల్లో నువ్వు బ్యాండు కొట్టు మామా.. బాసు బిందాసు వచ్చాడు చూడు భీమా.. హెయ్ మాసు టెంపరు, నువ్వు సైడ్ అయిపోరా మామా.. టెక్కు టెంపరు ఒకటైతేనే ఈ భీమా..’ అంటూ సాగిన ఈ మాస్ సాంగ్లో గోపీచంద్ డ్యాన్స్ మూమెంట్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. గోపీచంద్కు జంటగా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటిస్తున్నారు. అజ్జు మహంకాళి డైలాగ్స్ రాస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న సినిమా విడుదల కానుంది.