రాజాసింగ్​ సస్పెన్షన్​ ఎత్తివేతపై సంబరాలు

రాజాసింగ్​ సస్పెన్షన్​ ఎత్తివేతపై సంబరాలు

నిజామాబాద్, వెలుగు : గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​పై బీజేపీ పార్టీ సస్పెన్షన్​ ఎత్తివేసిన నేపథ్యంలో ఆయన అభిమానులు మంగళవారం నిజమాబాద్​లో  సంబరాలు చేసుకున్నారు. నాందేవ్​వాడలోని శివాజీ చౌరస్తాలో రాజాసింగ్​ ఫొటోకు పాలాభిషేకం చేశారు. హిందూధర్మానికి అంకితమైన ఆయన  మరోసారి భారీ మెజారిటీతో గెలువాలని కోరుకుంటూ నినాదాలు చేశారు.