అంబర్ పేట, వెలుగు: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు జనం తగిన బుద్ధి చెప్తారని అంబర్ పేట సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డి తెలిపారు. అంబర్పేట సెగ్మెంట్ వాసులు మార్పు కోరుకుంటున్నారని.. ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సెగ్మెంట్ పరిధిలోని డీడీ కాలనీ నుంచి ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.
అనంతరం జరిగిన రవాణా రంగ కార్మికుల సమావేశానికి రోహిన్ రెడ్డి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రవాణా రంగ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు రోహిన్ రెడ్డికి పూర్తి మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో కార్మికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.