కాలేజీల్లో కాంట్రాక్టు, గెస్టు లెక్చరర్ల కొనసాగింపు

కాలేజీల్లో కాంట్రాక్టు, గెస్టు లెక్చరర్ల కొనసాగింపు

 

  • ఉత్తర్వులు జారీచేసిన సర్కార్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, గెస్టు లెక్చరర్లను ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. స్టేట్ వైడ్​గా 2280 మందిని తీసుకుంటూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో1219ని  రిలీజ్ చేశారు. వారిలో  1654 మంది గెస్టు లెక్చరర్లు, 449 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 53 మంది పార్ట్ టైమ్ అవర్లీ బెస్డ్, 43 మంది పార్ట్ టైమ్ కన్సాలిడేట్, ముగ్గురు మినిమమ్ టైమ్ స్కేల్ లెక్చరర్లు ఉన్నారు. 

 వీరిని ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకూ కొనసాగించేందుకు అవకాశం కల్పించారు. కాగా, సర్కారు నిర్ణయం పట్ల గెస్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. 11 ఏండ్ల నుంచి సేవలందిస్తున్న గెస్టు లెక్చరర్ల శ్రమను గుర్తించి కంటిన్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నాయకులకు ధన్యవాదాలు చెప్పారు.