కవ్వాల్ టైగర్ జోన్ లో న్యాయవాదుల పర్యటన

కవ్వాల్ టైగర్ జోన్ లో న్యాయవాదుల పర్యటన

జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ లో శుక్రవారం ఉదయం హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజుతోపాటు వివిధ కోర్టుల్లో పని చేస్తున్న 12 మంది ప్రభుత్వ న్యాయవాదులు పర్యటించారు. జన్నారం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్న గొండుగూడ, బైసన్ కుంట, సోలార్ బోర్​వెల్స్, మల్యాల వాచ్ టవర్ ప్రాంతాలకు సఫారీలో వెళ్లి, అడవి అందాలతోపాటు వన్యప్రాణులను తిలకించారు.

అడవుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఫారెస్ట్ ఆఫీసర్లు వారికి వివరించారు. తాళ్లపేట రేంజ్ ఆఫీసర్ సుష్మారావు, జన్నారం డీఆర్ వో మమత, బీట్ ఆఫీసర్ లాలుబాయి తదితరులున్నారు.