కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సేవలు పొడిగింపు..

కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సేవలు పొడిగింపు..

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్​ కాలేజీలు, నర్సింగ్​కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న వివిధ హాస్పిటళ్లలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయీస్​ సర్వీస్​ను ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్​ సెక్రటరీ సందీప్​కుమార్​ సుల్తానియా ఆర్డర్స్​​జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డైరెక్టరేట్ ఆఫ్  మెడికల్  ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​ పరిధిలో 16,448 మంది కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్​ఎంప్లాయీస్​ పని చేస్తున్నారు.

ఆయా కాలేజీలు, హాస్పిటల్స్​లో ఖాళీలను బట్టి పలు దఫాలుగా వీరిని విధుల్లోకి తీసుకున్నారు. కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ను డైరెక్టుగా ప్రభుత్వమే రిక్రూట్​ చేయగా, ప్రైవేట్​ ఏజెన్సీల ద్వారా ఔట్​ సోర్సింగ్​ సిబ్బందిని నియమించారు. ఏడాదికోసారి వీరి సర్వీస్​ను పొడిగించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం 4,772 మంది కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ పని చేస్తుండగా, ఔట్ సోర్సింగ్​లో 8,615 మంది, హానరోరియంపై 3,056 మంది కొనసాగుతున్నారు. మరో ఐదుగురు మల్టీ టాస్కింగ్​స్టాఫ్(ఎంటీఎస్)​ ఉన్నారు. 2025 ఏప్రిల్​ ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు వీరు  కంటిన్యూ అవుతారు.

మంచిర్యాలకు మరో 80 పోస్టులు..

మంచిర్యాల మెడికల్​ కాలేజీ, జీజీహెచ్​ పరిధిలో ప్రస్తుతం 105 మంది ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయీస్​ పని చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా మరో 80 పోస్టులను మంజూరు​చేసింది. వీరి నియామకంతో స్టాఫ్​ కొరత పూర్తిగా తీరనుందని అధికారులు తెలిపారు.