సర్కార్ బడుల్లో చదివేదెట్లా..! ఓవైపు బుక్స్, యూనిఫామ్ల కొరత.. మరోవైపు పెరుగుతున్న అడ్మిషన్లు

సర్కార్ బడుల్లో చదివేదెట్లా..! ఓవైపు బుక్స్, యూనిఫామ్ల కొరత.. మరోవైపు పెరుగుతున్న అడ్మిషన్లు
  • ఇప్పటికే నిజామాబాద్​జిల్లాలో 26 వేలకుపైగా విద్యార్థుల చేరిక 
  • సర్దుబాటు చేయలేక టీచర్ల తిప్పలు

నిజామాబాద్, వెలుగు :  జిల్లాలోని సర్కారు బడులకు ఆదరణ పెరుగుతోంది.  6 నుంచి 19 వరకు బడిబాట నిర్వహించగా అంచనాకు మించి అడ్మిషన్లు వచ్చాయి.  ప్రైవేట్ పాఠశాలల ఫీజులు భరించలేక సర్కార్​ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు.  ఫ్రీ చదువు, ఉచిత పుస్తకాలు, రెండు జతల యూనిఫామ్​లు, మధ్యాహ్న భోజనం, టీచర్ల ఖాళీల భర్తీతో తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై నమ్మకం పెరిగింది. గత సంవత్సరం స్ట్రెంత్​ లెక్కన ఇండెంట్​ పెట్టడంతో కొత్తగా చేరిన విద్యార్థులకు యూనిఫామ్స్​, బుక్స్​కు కొరత ఏర్పడింది. కొత్త స్టూడెంట్లకు బుక్స్​ అందకపోవడంతో వారు క్లాసుల్లో ఇబ్బంది పడుతున్నారు.

కోఆర్డినేషన్ లేని ఇండెంట్ ..

జిల్లాలో 693 ప్రైమరీ, 116 అప్పర్​ ప్రైమరీ, 230 హైస్కూల్స్​, 25 కేజీబీవీ, 90 ఆదర్శ ఇతర రెనిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులు 1,22,264 గా మంది  ఉన్నారు. ఏటా బుక్స్​, యూనిఫామ్స్ కోసం పెరుగుతున్న సంఖ్యను బట్టి ఇండెంట్ పెట్టాలి. బుక్స్​ కోసం ఇండెంట్ పెట్టిన యంత్రాంగం  విద్యార్థుల సంఖ్యను 99,825 చూపి 7,18,590 పుస్తకాలు కావాలని కోరగా, 6,89,030 వచ్చాయి.

యూనిఫామ్స్​కోసం 1,01,450 మంది కోసం ఇండెంట్​ పెట్టగా వారికి  ఒక జత యూనిఫామ్ పంపిణీ చేసి, మరో జత వారంలో ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ నెల 19 నాటికి బడిబాట ముగిసినప్పటికీ జూలై మొదటి వారం దాకా కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కొత్త అడ్మిషన్లు 26 వేలు దాటగా, మరింత పెరిగే అవకాశం ఉంది.  కొత్తగా చేరిన స్టూడెంట్లకు బుక్స్, యూనిఫామ్స్ సర్దడం కష్టంగా మారింది.  బుక్స్ లేకుండా బడులకు వెళ్తున్న స్టూడెంట్స్​ను చూసి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. 

కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం..

పాత ఇండెంట్​ ప్రకారం బుక్స్ వచ్చాయి. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రాలేదు. వచ్చిన వాటిని 90 శాతం విద్యార్థులకు అందించాం. ఇంకా పది శాతం మందికి కొరత ఏర్పడింది. కొత్త అడ్మిషన్లు పొందిన వారి వివరాలు కలెక్టర్​కు నివేదిస్తాం. మరో ఇండెంట్ ప్రభుత్వానికి పంపి వీలైనంత త్వరగా బుక్స్​ వచ్చేలా చూస్తాం. -బాలకృష్ణ, గవర్నమెంట్ బుక్స్ ఇన్​చార్జి

అందరికీ యూనిఫామ్స్​ఇస్తాం..

యూ-డైస్ వివరాల ప్రకారం 1,01,450 మంది స్టూడెంట్స్ సంఖ్యకు అనుగుణంగా క్లాత్​ తెప్పించి ఒక జత పంపిణీ చేశాం. మరో జత వారంలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎయిడెడ్ స్కూల్ పిల్లలకు కూడా సర్కార్ యూనిఫామ్స్​వస్తాయి. అయితే వాటిని తీసుకోవడానికి మేనేజ్​మెంట్లు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఆ విషయాన్ని కలెక్టర్​కు చెప్పి నిర్ణయం తీసుకుంటాం. విద్యార్థులందరికీ యూనిఫామ్స్ అందేలా ఏర్పాట్లు చేస్తాం. -  -శ్రీనివాస్​రావు, సీఎంవో