ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ప్రైమరీ స్కూళ్లకు పునరుజ్జీవం .. మూతపడిన సర్కార్ స్కూళ్లు రీ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ప్రైమరీ స్కూళ్లకు పునరుజ్జీవం .. మూతపడిన సర్కార్ స్కూళ్లు రీ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •  గతంలో మూతపడిన సర్కార్ స్కూళ్లు రీ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •  మిగతా స్కూళ్లను రీఓపెన్ చేయించేందుకు విద్యాశాఖ ప్రయత్నాలు
  •  ప్రీప్రైమరీ విధానంతో ప్రైమరీ స్కూళ్లలో పెరుగుతున్న ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో సర్కారీ ప్రైమరీ స్కూళ్లకు పునరుజ్జీవం కలుగుతోంది. గత సర్కార్ హయాంలో మూతపడిన బడులను ఆఫీసర్లు తిరిగి తెరుస్తున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడుతూ విద్యార్థుల ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ పెంచుతున్నారు. సర్కార్ స్కూళ్లను బలోపేతం చేయడానికి ప్రతి పంచాయతీలో ఒక బడి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరం కూడా మూతబడిన స్కూళ్ల రీఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీచర్లు దృష్టి సారించారు. కరీంనగర్ జిల్లాలో ఇలా ఇప్పటి వరకు 5 స్కూళ్లు, జగిత్యాల జిల్లాలో రెండు స్కూళ్లు తెరుచుకున్నాయి. 

బడిబాటతో కొత్త అడ్మిషన్లు.. 

కరీంనగర్ జిల్లాలో పదేళ్లలో 50 ప్రైమరీ స్కూళ్ల వరకు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే చేపట్టిన బడిబాట సత్ఫలితాలనిచ్చింది. గతంలో మూతపడిన పాఠశాలల్లోనూ తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకొచ్చారు. హుజూరాబాద్ మండలం బొత్తలపల్లి గ్రామంలోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఏడేళ్ల కింద మూతపడింది. ఈ భవనాన్ని జీపీ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ స్కూల్ కు పంపించడానికి ఆసక్తి చూపడంతో రీఓపెన్ చేశారు. మొదటి రోజు 12 మంది చిన్నారులు స్కూల్ కు వచ్చారు. 

వీణవంక మండలం దేశాయిపల్లి ప్రైమరీ స్కూల్ లో ఐదుగురు విద్యార్థులు రావడంతో రీ ఓపెన్ చేశారు. గన్నేరువరం మండలం గోపాల్ పూర్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ గతంలో టీచర్స్, విద్యార్థులు లేక క్లోజ్ కాగా, ఈ నెల 12న 18 మంది విద్యార్థులతో డీఈవో మొండయ్య పున: ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వడ్డెర కాలనీ, కొంపల్లి ప్రాథమిక పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం తెరుచుకున్నాయి. రాంపూర్ వడ్డెర కాలనీ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15 మంది, కొంపల్లి పాఠశాలలో ఏడుగురు స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నారు. 

ప్రీప్రైమరీతో ప్రైమరీ స్కూళ్లకు బూస్టింగ్

ఇన్నాళ్లు ప్రైమరీ స్కూళ్లలో ఐదేళ్లు దాటిన చిన్నారులకు ఒకటో తరగతి నుంచే అడ్మిషన్లు ఇచ్చేవారు. ప్రైవేట్ స్కూళ్ల తరహాలో ఎల్ కేజీ, యూకేజీ, నర్సరీ లేకపోవడంతో.. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల వైపే మొగ్గుచూపేవారు. లేదంటే అంగన్ వాడీ సెంటర్లకు పంపించేవారు. అందుకే ప్రభుత్వం ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ సెక్షన్ ప్రారంభించేందుకు ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ప్రైమరీ స్కూళ్లకు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 81 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. 

ఇందులో అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో 46, జగిత్యాల జిల్లాలో 32, కరీంనగర్ జిల్లాలో 3 స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లలో ప్రస్తుతం అంగన్ వాడీ సెంటర్లలో ఉన్న పిల్లలను ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా విద్యా వలంటీర్, ఆయాను ప్రభుత్వం నియమించనున్నట్లు తెలిసింది. అలాగే ప్లే స్కూల్ తరహాలో ప్రైమరీ స్కూళ్లను అప్ గ్రేడ్ చేస్తూ ఆట వస్తువులు, బోధనా సామగ్రి కూడా సమకూర్చనున్నట్లు సమాచారం.