![మందమర్రిలో సుమన్ ప్రచారం షురూ](https://static.v6velugu.com/uploads/2023/10/government-whip-balka-suman-says-cm-kcr-come-to-mandamarri-on-november-7-as-part-of-election-campaign_VAaonKxZNT.jpg)
కోల్బెల్ట్, వెలుగు : ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 7న మందమర్రికి సీఎం కేసీఆర్ రానున్నట్లు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. శుక్రవారం ఆయన మందమర్రిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముందుగా స్థానిక ఏడో వార్డు పాలచెట్టు ఏరియాలోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7న మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగసభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన ఆయా దుకాణాదారులతో మాట్లాడుతూ వారు చేసే పనిని అతడు చేసి ఉత్తేజపరిచారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో పాంప్లేట్స్ అందజేశారు. సీఎం కేసీఆర్ బహిరంగసభ నిర్వహించే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు.