మహారాష్ట్ర సర్కార్ దానంతట అదే కూలిపోతుంది

మహారాష్ట్ర సర్కార్ దానంతట అదే కూలిపోతుంది

ముంబై: మహారాష్ట్రలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని ఫడ్నవీస్ చెప్పారు. ‘మహారాష్ట్రలో ఇలాంటి ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమే. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం కూలుతుందో అప్పుడు మేం ప్రత్యామ్నాయ గవర్నమెంట్‌‌ను ఏర్పాటు చేస్తాం. కానీ ఇప్పుడు మేం దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రాష్ట్రంలో పరిష్కారం కాని సమస్యలు చాలా ఉన్నాయి. రైతులు ఆందోళనలో, బాధలో ఉన్నారు. వారికి ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందించలేదు. ఒక ప్రతిపక్ష పార్టీగా రైతుల తరఫున ప్రభుత్వాన్ని మేం ప్రశ్నిస్తున్నాం’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.