రేవంత్ సర్కార్ రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు గవర్నర్ తమిళి సై. అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి మాట్లాడిన గవర్నర్.. గత ప్రభుత్వాల అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యిందన్నారు. దుబారా ఎక్కడ జరిగిందో కనిపెట్టే పనిలో ఉన్నామని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గవర్నర్.
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల్లో రెండు ప్రారంభించిందన్నారు గవర్నర్ తమిళి సై.ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు పథకాలు ప్రారంభించామన్నారు. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కొత్త ప్రభుత్వంలో తెలంగాణ స్వేఛ్చా వాయువులు పీల్చుకుంటోందన్నారు. ప్రజాప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నానని చెప్పారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఇనుప కంచలు తొలిగిపోయాయని తెలిపారు.
ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. భూ మాత పోర్టల్ అత్యంత పారదర్శకంగా ఉంటుందనన్నారు. అడ్డుగోడలు,అద్ధాల మేడలు పటాపంచలయ్యాయని తెలిపారు. దుర్వినియోగం, దుబారా ఎక్కడ జరిగిందే కనిపెట్టే పనిలో ఉన్నామన్నారు గవర్నర్. హైదరాబాద్ రాజధానే కాదు.. అత్యధిక రెవెన్యూ ప్రాంతమని చెప్పారు. త్వరలో అన్ని శాఖలపై శ్వేతపత్రం విడుదలచేస్తామన్నారు. ప్రజలపై భారం మోపకుండా మెరుగైన పాలన అందిస్తామన్నారు. కృష్ణానదిలో తెలంగాణ వాటా కోసం పోరాడతామన్నారు గవర్నర్.