బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు గవర్నర్ బాసట

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు గవర్నర్ బాసట

సమస్యలను పరిష్కరించాలంటూ నిర్మల్లోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు బుధవారం నిర్వహించిన నిరసనలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. జోరువానలోనూ విద్యార్థులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి రావడం తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు.  విద్యార్థులంతా వారివారి ఆరోగ్యాలపై దృష్టిపెట్టాలని సూచించారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేయడంతో పాటు జీవిత లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యల అంశాన్ని తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ట్విటర్ వేదికగా గవర్నర్  వెల్లడించారు. ఈ ట్వీట్ కు తెలంగాణ సీఎంవో ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేశారు.