రాష్ట్ర గవర్నర్ తమిళి సై కిందపడ్డారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ఈవెంట్కు హాజరైన తమిళి సై.. కార్పెట్ పై నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గవర్నర్ను పైకి లేపారు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ తాను కిందపడిన ఈ వార్త టీవీల్లో హైలైట్ అవుతుందంటూ సరదాగా అన్నారు.
హైబ్రిడ్ రాకెట్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రసంగించారు. ఆ తర్వాత ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కార్పెట్పై జారి పడిపోయారు. సుమారు 3500 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 6 నుంచి 12వ తరగతి చదివే 5వేల మంది విద్యార్థులు తయారుచేసిన 150 మినీ హైబ్రిడ్ ఉపగ్రహాల (పైకో శాటిలైట్స్)ను ప్రయోగించారు. ఈ రాకెట్ ప్రయోగాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నే షనల్ ఫౌండేషన్, మార్టిన్ ఫౌండేషన్, స్పేస్ జోన్ ఇండియా సంయుక్తం గా చేపట్టాయి.