ఫ్లైట్లో ప్రయాణికుడికి గవర్నర్ తమిళిసై వైద్యం

ఫ్లైట్లో   ప్రయాణికుడికి గవర్నర్ తమిళిసై వైద్యం

రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి మంచి మనసును చాటుకున్నారు. వారణాసి నుండి హైదరాబాద్ తిరుగు ప్రయాణ సమయంలో ఫ్లైట్లో  ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో అతనికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రాథమిక చికిత్స చేశారు.

 విమానం గాల్లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమాన సిబ్బంది ఫ్లైట్లో ఎవరైనా డాక్టర్ లు ఉన్నారా అని అనౌన్స్ చేయడంతో...విషయం తెలుసుకున్న  డాక్టర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ వెంటనే స్పందించారు.  ఆ ప్రయాణికుడి దగ్గరకు వెళ్లి.. ప్రాథమిక చికిత్స అందించారు. భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు.  కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్ తమిళిసైకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు తమిళిసైకు అభినందనలు తెలిపారు.

గవర్నర్ తమిళిసై ప్రయాణికుడికి చికిత్స చేస్తున్న సమయంలో మరో ప్రయాణికుడు ఫోటోలు తీసి ట్విట్టర్ లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  వైద్యురాలు.  ఎంబిబిఎస్,  ఎండి డిజిఓ లాంటి వైద్య విద్య కోర్సులు ఆమె చేసింది.