తమిళ స్టార్ హీరో విశాల్ ముంబయి సెన్సార్ అధికారులపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసందే. ఆయన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని హిందీ సెన్సార్ పనుల కోసం అధికారులకు 6.5లక్షలు లంచంగా ఇచ్చానని డైరెక్ట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా.. ముంబయి సెన్సార్ బోర్డులో అవినీతి పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు.
అయితే.. విశాల్ చేసిన ఈ కామెంట్స్ పై సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పందించింది. ఇది చాలా దురదృష్టకరం అని పేర్కొంది. ఈ మేరకు విశాల్ కామెంట్స్ తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దర్యాప్తు కోసం MIB నుండి సీనియర్ అధికారిని నియమించింది.
ALSO READ : Skanda First day collections: స్కంద ఊరమాస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ మాస్ జాతర
The issue of corruption in CBFC brought forth by actor @VishalKOfficial is extremely unfortunate.
— Ministry of Information and Broadcasting (@MIB_India) September 29, 2023
The Government has zero tolerance for corruption and strictest action will be taken against anyone found involved. A senior officer from the Ministry of Information & Broadcasting…
నటుడు విశాల్ కు CBFCలో ఎదురైనా అనుభవం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదు. ఈ వివాదంలో ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుండి ఒక సీనియర్ అధికారి ఈ విచారణ కోసం నియమిస్తున్నాం. ఈరోజే విచారణ జరపాలి అని MIB ట్వీట్లో పేర్కొంది.