టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చేది ఇలాగే..

టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చేది ఇలాగే..

ఇంటర్నల్ మార్కులతో గ్రేడింగ్​ ఇలా..!

హైదరాబాద్, వెలుగు: టెన్త్​ క్లాస్​లో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించడంతో అందరి ఫోకస్​ వాటిపై  పడింది. అయితే గ్రేడింగ్ విధివిధానాలపై మంగళవారం ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేయనున్నది. రాష్ట్రంలో 5,34,903 మంది టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​ ఉన్నారు. వీరిలో  5,09,079 మంది రెగ్యులర్  స్టూడెంట్స్​ కాగా.. 25,824 మంది ప్రైవేటు స్టూడెంట్స్.

ఇప్పటికే ఇంటర్నల్​ మార్కుల అప్​లోడ్​

టెన్త్​లో ప్రతి సబ్జెక్టులో వంద మార్కులు ఉండగా, దీంట్లో రాత పరీక్ష ద్వారా 80 మార్కులు, ఫార్మెటివ్​ అసెస్మెంట్​(ఎఫ్​ఏ) ద్వారా మరో 20 మార్కులు (ఇంటర్నల్​ మార్కులు) కేటాయిస్తారు. ఎఫ్​ఏ పరీక్షలను అకడమిక్​ ఇయర్​లో ప్రతి రెండు నెలలకోసారి నిర్వహిస్తారు. రెగ్యులర్ స్టూడెంట్స్​కు సంబంధించిన ఈ ఇంటర్నల్ మార్కుల వివరాలను ఇప్పటికే ప్రభుత్వ పరీక్షల విభాగం ఆన్​లైన్​ద్వారా సేకరించింది. వాటి ఆధారంగా ఈసారి స్టూడెంట్స్​కు  గ్రేడింగ్ ఇవ్వనున్నారు. ప్రైవేటు స్టూడెంట్స్​కు సంబంధించి గతంలో ఎఫ్ఏ పరీక్షలు రాసి ఉంటారు కాబట్టి, ఆ మార్కులకు పరిగణనలోకి తీసుకునే చాన్స్ ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రాసెస్ అంతా సక్రమంగా జరిగితే, వారం పదిరోజుల్లో గ్రేడింగ్​ రిజల్ట్స్​ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.  సర్కారు తీసుకున్న నిర్ణయంతో కేవలం స్కూళ్లలో ఇంటర్నల్​గా జరిగిన పరీక్షలకు ఆబ్సెంట్​ అయిన వారే ఫెయిల్ అయ్యే చాన్స్ ఉంది.

గ్రేడింగ్స్, పాయింట్లు ఇట్లేస్తరు..!

స్టూడెంట్స్​కు వచ్చిన మార్కుల ఆధారంగా సీసీఈ విధానంలో 8  గ్రేడ్స్ ఇస్తారు. దీంట్లో 91 మార్కుల నుంచి100 మార్కుల వరకు వస్తే ఆ స్టూడెంట్​కు  ఏ1 గ్రేడ్​గా గుర్తించి పది గ్రేడ్ పాయింట్లు కేటాయిస్తారు. జీరో నుంచి 34 మార్కుల వరకొస్తే డీ 2 గ్రేడ్ ఇచ్చి.. మూడు పాయింట్లు ఇస్తారు. డీ 2  గ్రేడ్ అంటే ఫెయిల్​గా పరిగణిస్తారు. అయితే ఇంటర్నల్​మార్కుల్లో ప్రైవేటు స్కూల్స్​ దాదాపు 20కి 20 మార్కులు వేసుకుంటారని, సర్కారు స్కూల్స్​లో తక్కువ మార్కులు వేస్తారనే విమర్శ మొదటి నుంచి ఉంది.

పూర్తి మార్కులు వేసేది ఇట్ల..!

ఎఫ్​ఏ 1, 2, 3, 4.. ఇలా నాలుగు ఎఫ్​ఏ  ఎగ్జామ్స్​లో ప్రతి సబ్జెక్టుకు 20 మార్కుల చొప్పున మొత్తంగా 80 మార్కులు ఉంటాయి. ఈ మొత్తంలో యావరేజ్​ మార్కులను తీసుకొని.. దానికి ఐదురెట్లు పెంచుతారు. అలా పెంచినదాన్ని పూర్తిస్థాయి మార్కులుగా పరిగణించనున్నారు. దీని ఆధారంగా  గ్రేడ్స్​, పాయింట్లు కేటాయించనున్నారు. ప్రతి సబ్జెక్టుకూ ఇదే విధానాన్ని అమలుచేస్తారు. ఉదాహరణకు ఒక సబ్జెక్టుకు సంబంధించి నాలుగు ఎఫ్​ఏ ఎగ్జామ్స్​లో యావరేజ్​గా 10 మార్కులు వస్తే.. పూర్తి స్థాయి మార్కులు 50 వచ్చినట్లుగా నిర్ధారిస్తారు. అదే నాలుగు ఎఫ్​ఏల్లో యావరేజ్​గా 20  మార్కులు వస్తే.. పూర్థి స్థాయి మార్కులు 100 వచ్చినట్లుగా పేర్కొంటారు.

మార్కులు                గ్రేడ్         గ్రేడ్ పాయింట్లు

91 నుంచి 100         ఏ1           10

81-90                   ఏ2             9

71-80                   బీ1             8

61-70                   బీ2             7

51-60                   సీ1             6

41-50                   సీ2             5

35-40                   డీ1             4

0-34                     డీ2             3

For More News..

ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌లో శ్రియా కన్‌‌‌‌ఫర్మ్

లాక్​‌డౌన్‌ దెబ్బకు అన్నీ డబుల్ రేట్లు

కొడుకు ప్రేమిస్తే.. తండ్రిని చంపేశారు