ఇంటర్​ మెమోలో కీలక మార్పులు

ఇంటర్​ మెమోలో కీలక మార్పులు

గ్రేడింగ్​తో పాటు మార్కులు కూడా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం

ఈ విద్యాసంవత్సరం నుంచే ఏపీలో అమలు

అమరావతి, వెలుగు: ఇంటర్‌లో గ్రేడింగ్‌లతో పాటు మార్కులు కూడా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత చదువులకోసం నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌లో కొన్ని రాష్ట్రాలు ఇంటర్ మార్కులను పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో స్టూడెంట్లకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంటర్ మార్కుల మెమోలలో గ్రేడింగ్‌తో పాటు మార్కులు కూడా ఇస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేశ్ తెలిపారు. మార్చి 4 నుంచి 23 వ తేదీ వరకు ఇంటర్ యాన్యువల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 20 రోజుల పాటు 1,411 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతాయన్నారు.

For More News..

వాషింగ్టన్‌లో ల్యాండవ్వగానే భారత టూర్‌పై ట్రంప్ ట్వీట్

మంగమ్మా.. ఏందమ్మా మీ సమస్య? కలెక్టర్‌నంటూ పరిచయం చేసుకొని..

సరోగసి బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. 16 వారాల ఇన్సూరెన్స్ 36 వారాలకు పెంపు

20 వేల ఏండ్ల కిందటి అలుగు.. చెక్కుచెదరని దేహం