మెదక్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లాలో పోలీసుల వెహికల్ చెకింగ్ లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది. మంగళవారం చేగుంట ఎస్ఐ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్వ్కాడ్ టీమ్ చేగుంట, గజ్వేల్ రూట్లో మక్కరాజ్ పేట వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంగా బుల్లెట్ పై చేగుంట వైపు వస్తున్న గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన గుండెల్లి యాదగిరి, శిరీష దంపతులను ఆపి తనిఖీ చేశారు. వారివద్ద రూ.30,59,500 గుర్తించారు. ఆ నగదు గురించి వారు స్పష్టమైన వివరణ ఇవ్వక పోవడంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న నగదును సంబంధిత అధికారులకు అప్పగించారు.
