కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని దుర్షేడులో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బోనాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో గౌడ కులస్తులు బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దయతో వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలన్నారు.
