
గంగాధర, వెలుగు: కరీంనగర్– జగిత్యాల హైవే గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో లారీ నుంచి ఓ గ్రానైట్ బండ నడిరోడ్డుపై పడింది. గ్రానైట్ లారీ ట్రాలీ ఇంజిన్ నుంచి వేరుకావడంతో బండ జారిపడ్డట్టు స్థానికులు తెలిపారు. గ్రానైట్లారీ జగిత్యాల రూట్ నుంచి బోయినపల్లి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగిందని ఎస్సై అభిలాష్ తెలిపారు. రోడ్డుపై పడ్డ రాయిని పోలీసులు భారీ క్రేన్ తో తొలగించారు.