25 ఏనుగుల గుంపు..10 ఎకరాల అరటితోట ఆగం

25 ఏనుగుల గుంపు..10 ఎకరాల అరటితోట ఆగం

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయితీ దిగువ మారుమూల గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో మంగళవారం అర్థరాత్రి ఏనుగుల గుంపు స్వైర విహారం చేసింది. సుమారు 25 ఏనుగులు10 ఎకరాల మేర ఆస్తి నష్టం చేసినట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏనుగుల గుంపు సుమారు 7 మంది రైతుల వ్యవసాయ పొలాలలో ప్రవేశించి నష్టం చేసినట్టులు బాధితులు తెలుపుతున్నారు. వేణుగోపాల్ రెడ్డి అనే రైతుకు చెందిన అరటి తోపును ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేశాయి. ఏనుగులు వచ్చినపుడు ఫారెస్ట్ గార్డ్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని రైతులు వాపోయారు. ఏనుగుల్ని కట్టడి చేసి, జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.