సంచలనం రేపిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్పై సీబీఐ విచారణ జరుగుతోంది. మరోవైపు నెపోటిజమే ఆత్మహత్యకి కారణమంటూ కొందరు సెలెబ్రిటీస్పై జరుగుతున్న ట్రోలింగ్ అంతకంతకీ పెరిగిపోతోంది. కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్, మహేష్ భట్, అనన్య పాండే, ఇషాన్ ఖట్టర్ లాంటి వారందరినీ ఈ సెగ తాకింది. కానీ వీరందరి కంటే కూడా అలియాభట్ పైనే ఎక్కువ ఎఫెక్ట్ పడుతోంది. సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో ఆలియా తండ్రి మహేష్ భట్ సన్నిహితంగా ఉన్న ఫొటోస్, వాట్సాప్ చాటింగ్ స్క్రీన్షాట్స్ నెట్లో సర్క్యులేట్ అవుతుండటమే ఇందుకు కారణం. తన కూతురు ఆలియాని హీరోయిన్గా పెట్టి మహేష్ భట్ తీసిన ‘సడక్ 2’ ట్రైలర్కి భారీ ఎత్తున వచ్చిన డిస్లైక్స్.. ఆలియాపై అయిష్ట త ఎంతగా పెరిగిపోయిందనడానికి నిదర్శనం. ఈ నెలాఖరులో ఓటీటీ ద్వారా రిలీజ్ అవనున్న సినిమాపై కూడా ఈ ప్రభావం కొంత ఉండొచ్చు.
ఇదిలా ఉంటే ఆలియాకి సంబంధించి మరో నెగిటివ్ న్యూస్ బాగా చక్కర్లు కొడుతోంది. రాజమౌళి తీస్తున్న భారీ పీరియాడిక్ ఫిక్షన్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఆలియా భట్ని తీసేసి, ఆ స్థా నంలో ప్రియాంక చోప్రాని తీసుకున్నారనేదే ఆ వార్త. ఆలియాను ఆడియెన్స్ రిజెక్ట్ చేస్తున్నారనే కారణంతో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ సర్కిల్స్లో ఈ వార్త ఎక్కువ స్ప్రెడ్ అయింది. కానీ భట్ టీమ్ ఈ వార్తలను ఖండించింది. ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోందని, అందుకు సంబంధించిన ప్రిపరేషన్లో ఉందని, తెలుగు కూడా నేర్చుకుంటోందని క్లారిటీ ఇచ్చారు. ఆలియా రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసేందుకు కొందరు పని గట్టుకుని ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని వారు అంటున్నారు. అయితే ఇదంతా మహేష్ భట్ ఎఫెక్ట్ అనే విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. దీనిపై ఓసారి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కూడా రియాక్టయి క్లారిటీ ఇస్తే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.