మహాలక్ష్మి, గృహజ్యోతి మార్గదర్శకాలు ఇవే..!

మహాలక్ష్మి, గృహజ్యోతి మార్గదర్శకాలు ఇవే..!
  •   జీవో జారీ చేసిన సర్కారు

హైదరాబాద్, వెలుగు: మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో రెండు పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.500కు గ్యాస్  సిలిండర్, గృహజ్యోతి స్కీమ్‌‌‌‌‌‌‌‌లను ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ స్కీమ్ లకు సంబంధించిన గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్  విడుదల చేస్తూ సర్కారు జీవో జారీ చేసింది. ఇందుకు మూడు క్రైటీరియాలను ప్రకటించింది. 

మహాలక్ష్మి పథకం అమలు ఇలా..

  •     సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 40 లక్షల లబ్ధిదారులను గుర్తించారు.
  •     ఈ పథకానికి అర్హులుగా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికం చేశారు.
  •     మూడేండ్లు వినియోగించిన సిలిండర్‌‌‌‌‌‌‌‌ను పరిగణనలోకి తీసుకొని, దాని సగటు ఆధారంగా సంవత్సరానికి సిలిండర్లు కేటాయిస్తారు.
  •     వినియోగదారులు తొలుత మొత్తం పైసలు ఇచ్చి సిలిండర్  తీసుకోవాలి. ఆ తరువాత వారి ఖాతాలోకి సబ్సిడీ డబ్బు జమ చేస్తారు.
  •     గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం నేరుగా ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ సంస్థలకు ఇవ్వనుంది. ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ కంపెనీలు డీబీటీ ద్వారా వినియోగదారుల ఖాతాలో నగదు బదిలీ చేస్తాయి.
  •     భవిష్యత్తులో వినియోగదారులు రూ. 500 చెల్లించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
  •     ఓఎంసీ కంపెనీలు నేషనల్‌‌‌‌‌‌‌‌  పేమెంట్‌‌‌‌‌‌‌‌  పోర్టల్‌‌‌‌‌‌‌‌  ద్వారా 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్‌‌‌‌‌‌‌‌లోకి సబ్సిడీ అమౌంట్  బదిలీ అయ్యేలా ఏర్పాట్లు చేశారు.
  •     జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని మానిటరింగ్ చేయనున్నారు.
  •     ప్రజాపాలన పోర్టల్‌‌‌‌‌‌‌‌, సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌  డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌  సబ్సిడీని లబ్ధిదారుల వారీగా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గృహజ్యోతి స్కీమ్‌‌‌‌‌‌‌‌ మార్గదర్శకాలు ..

  •      నెలకు 200 యూనిట్లలోపు వాడే వినియోగదారులకు ఈ స్కీం అమలు చేయనున్నారు.
  •     ప్రజా పాలనలో వచ్చిన అప్లికేషన్‌‌‌‌‌‌‌‌లలో రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డు, ఆధార్‌‌‌‌‌‌‌‌  కార్డులను కరెంట్‌‌‌‌‌‌‌‌ కనెక్షన్‌‌‌‌‌‌‌‌తో లిం క్‌‌‌‌‌‌‌‌  చేసి అప్రూవ్‌‌‌‌‌‌‌‌  అయిన వారికి అమలు చేస్తారు.
  •     నెలవారీ బిల్లులో 200 యూనిట్లలోపు ఉంటే వారికి జీరో బిల్లింగ్ ఇస్తారు.
  •     బిల్లులో పేర్లు మార్చాల్సిన అవసరం లేదు. రేషన్‌‌‌‌‌‌‌‌  కార్డుకు లింకైన కనెక్షన్‌‌‌‌‌‌‌‌కు గతంలో బిల్లులో ఎవరి పేరున్నా అదే పేరుతో అమలు చేస్తారు. 
  •     ప్రతి నెలా 20వ తేదీ వరకు గృహజ్యోతి స్కీమ్‌‌‌‌‌‌‌‌ కు సంబంధించి  సబ్సిడీ వివరాలను డిస్కంలు ప్రభుత్వానికి పంపిస్తాయి.
  •     సబ్సిడీని డిస్కంలకు సర్కారు చెల్లిస్తుంది.
  •     ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌లో గృహ వినియోగదారులకు కాకుండా అక్రమంగా వేరే కనెక్షన్లకు స్కీం అమలు చేస్తే విద్యుత్‌‌‌‌‌‌‌‌ చట్టం 2003 ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటారు.
  •     2024 మార్చి నుంచి ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ అమలులోకి వస్తుంది.
  •      ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల్లో తెల్లరేషన్‌‌‌‌‌‌‌‌ కార్డు ఉండి అప్లై చేసుకున్న వారందరికీ ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌  అమలవుతుంది.
  •      అర్హత ఉండి మళ్లీ ప్రజా పాలన ద్వారా రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డుతో గృహ వినియోగదారులు అప్లై చేసుకోవచ్చు. ఈ  స్లిప్‌‌‌‌‌‌‌‌తో డిస్కం, ఈఆర్‌‌‌‌‌‌‌‌వో ఆఫీసును  సంప్రదించాలి. వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో ఎలిజిబుల్‌‌‌‌‌‌‌‌  అని తేలితే గృహజ్యోతి స్కీమ్‌‌‌‌‌‌‌‌ను అమలు చేస్తారు.