గుంటూరు కారం మూవీ ట్రైలర్ రిలీజ్..

గుంటూరు కారం మూవీ ట్రైలర్ రిలీజ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న గుంటూరు కారం సినిమా ట్రైలర్ రానే వచ్చేసింది. ఈ ట్రైలర్ ను ఆదివారం( జనవరి 7) న రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. మహేష్ బాబు నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ సినిమా గుంటూరు కారం సంక్రాంతి కి అనగా జనవరి 12న విడుదల కానుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై మహేష్ బాబు అభిమానులు, ప్రేక్షకుల్లో చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ క్రమంలో గుంటూరు కారం మూవీ ట్రైలర్ ఇవాళ రీలీజ్ కావడం.. ట్రైలర్ అదిరింది అని టాక్ వస్తోంది. 

గుంటూరు కారం సినిమా ట్రైల‌ర్ విడుద‌లతో ఆదివారం హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద అభిమానులు హంగామా చేశారు. పెద్ద ఎత్తున బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసి బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా  నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్య కృష్ణ, జయరాం, ఈశ్వరి రావు, ప్రకాష్ రాజ్, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్  పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.  

గుంటూరు కారం చిత్రం .. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన మూడో చిత్రం.. వీరి కాంబినేషన్ గతంలో అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. ట్రైలర్ చూసిన తర్వాత గుంటూరు కారం చిత్రం బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని మహేష ఫ్యాన్స్ ధీమా తో ఉన్నారు. మాస్ యాక్షన్ క్యారెక్టర్ తో గుంటూరు కారంలో మహేష్ కనిపించడం చిత్రంపై భారీ అంచనాలున్నాయి.