
తుంగతుర్తి, వెలుగు:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలోని విద్యార్థినులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడ్తున్న విద్యార్థినులను పాఠశాలలో ఏఎన్ఎం లేకపోవడంతో టీచర్ సాయంతో స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు. ఈ మేరకు డాక్టర్ మమత విద్యార్థులను పరిశీలించి ట్రీట్మెంట్ అందించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ... రెండ్రోజులుగా తాము కడుపులో నొప్పి, జ్వరం, విరేచనాలతో బాధపడుతున్నామని చెప్పారు. అస్వస్థతతో ఉంటే ప్రిన్సిపల్ పట్టించుకోవడంలేదని, తమ తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయారు. పేద గిరిజన విద్యార్థినుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు కోరారు.