రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల స్టూడెంట్లు

రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల స్టూడెంట్లు

తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన స్టూడెంట్లు రాష్ట్ర స్థాయి హాకీ, బేస్ బాల్​పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్​పి.వనజ తెలిపారు. ఎస్​కే శాహీరీన్, నందినీ, మేఘన, మానస, రేవతి, సంజన, శ్రవిక హాకీ పోటీలకు, ఎన్.జోషిక బేస్​బాల్ పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు.

వీరంతా త్వరలో కామారెడ్డి, వనపర్తి జిల్లాల్లో జరిగే  రాష్ట్రస్థాయి  పోటీల్లో పాల్గొంటారన్నారు.