ప్రపంచంలో భారత రాజ్యాంగమే అత్యుత్తమమైంది: గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రపంచంలో భారత రాజ్యాంగమే అత్యుత్తమమైంది: గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రపంచంలో కెల్లా భారత రాజ్యాంగం అత్యుత్తమమైందని అన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయంటే అందుకు రాజ్యాంగ గొప్పతనమే కారణమేనని అన్నారు. పాకిస్థాన్ లో జరుగుతున్న పరిణామాలు చూసే వారికి భారత రాజ్యాంగం విలువ ఎంటో తెలుస్తుందని చెప్పారు.

రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం సంతోషించదగ్గ విషయమని రాజ్యాంగాన్ని రచించిన మహనీయులను స్మరించుకోవటం అదృష్టంమని తెలిపారు సుఖేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భారత రాజ్యాంగం అందించిన వరమని రాజ్యాంగ స్ఫూర్తి తోనే తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా అవతరిస్తోందని ఆయన చెప్పారు.