LSG vs RCB: సెంచరీ తర్వాత పంత్ అత్యుత్సాహం.. లక్నోని నిండా ముంచేసి ఈ కుప్పిగంతులు అవసరమా..

LSG vs RCB: సెంచరీ తర్వాత పంత్ అత్యుత్సాహం.. లక్నోని నిండా ముంచేసి ఈ కుప్పిగంతులు అవసరమా..

ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తొలిసారి తన పూర్తి స్థాయి ఆటను బయట పెట్టాడు. ఫామ్ లో ఉంటే తన ఆట ఎలా ఉంటుందో నిరూపించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగి లక్నో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ లక్నో సారధి.. ఓవరాల్ గా 61 బంతుల్లో 118 పరుగులు చేశాడు. పంత్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండడం విశేషం. పంత్ ఇన్నింగ్స్ ను ఎంత పొగిడినా తక్కువే. అయితే పంత్ చేసిన సెలెబ్రేషన్ మాత్రం కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది. 

ALSO READ | LSG vs RCB: హమ్మయ్య బిగ్ రిలీఫ్ ఇచ్చావు: ప్లే ఆఫ్స్‌కు ఆ ఇద్దరు స్టార్స్ వస్తారని చెప్పిన RCB కెప్టెన్

భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ 18 ఓవర్ నాలుగో బంతికి పంత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం తర్వాత హెల్మెట్ తీసేసి పల్టీ కొట్టాడు. ఆ తర్వాత చేతులు రెండు దూరంగా చాచి కళ్ళు మూసుకొని తన సహచరుడు పూరన్ ను హగ్ చేసుకున్నాడు. పంత్ చేసుకున్న ఈ సెలెబ్రేషన్ నెటిజన్స్ కు అంతగా నచ్చలేదు. ఎందుకంటే లక్నో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. పంత్ కూడా ఈ టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో పంత్ చేసిన పని కాస్త అతిగా అనిపించింది. ఈ ఒక్క మ్యాచ్ లో 118 పరుగులు చేసిన పంత్.. అంతకముందు వరకు ఈ టోర్నీలో 12 ఇన్నింగ్స్ ల్లో 151 పరుగులు మాత్రమే చేశాడు.                 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే లక్నో సూపర్ జయింట్స్ తమ చివరి మ్యాచ్ లో బ్యాటింగ్ లో అదరగొట్టింది. లక్నో వేదికగా మంగళవారం (మే 27) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి  235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ సీజన్ లో తొలిసారి  విజృంభించిన రిషబ్ పంత్ సెంచరీతో (61 బంతుల్లో 118: 11 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగడంతో పాటు సూపర్ ఫామ్ లో ఉన్న మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67:4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, తుషార, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.