యూపీలో వివాదాస్పద జ్ఞాన్వాపి మసీదు కేసు కోర్టులో ఉండగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞాన్వాపిని మసీదు అనలేమని..అలా అనడం వివాదమే అవుతుందన్నారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపిలో త్రిశూలం ఉందని.. అందులో దేవుడి విగ్రహాలు ఉన్నాయన్నారు. ముస్లీంలే ఈ చారిత్రక తప్పిదాన్ని అంగీకరించి జ్ఞానవాపిని అప్పగించాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి ముస్లీంలే పరిష్కారం తీసుకురావాలన్నారు.
జ్ఞానవాపి ఆవరణలో ఏఎస్ఐ సర్వేపై స్టేను అలహాబాద్ హైకోర్టు ఆగస్టు 3 వరకు పొడిగించింది. వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వులపై ఆ రోజే తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించింది. అప్పటివరకు తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు జులై 27న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రీతింకర్ దివాకర్ తెలిపారు. ఈ క్రమంలో సీఎం యోగి వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి.