నో ఫ్లైయింగ్ జోన్​గా .. హకీంపేట ఎయిర్ ఫోర్స్

నో  ఫ్లైయింగ్ జోన్​గా ..   హకీంపేట ఎయిర్ ఫోర్స్

గచ్చిబౌలి, వెలుగు:  ప్రధాని మోదీ వరంగల్ పర్యటనలో భాగంగా ఇయ్యాల స్పెషల్ ఫ్లైట్​లో మేడ్చల్ జిల్లాలోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్​కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్​లో వరంగల్​కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చుట్టూ 5 కి.మీ పరిధిలో 

నో ఫ్లైయింగ్ జోన్​గా ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డిస్టెన్స్​లో డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో ఎయిర్ క్రాఫ్ట్​ల అనుమతిని నిషేధించామని.. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సీపీ తెలిపారు. ఈ ఆంక్షలు ప్రధాని పర్యటన ముగిసే వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.