రాష్ట్రంలో ఒంటిపూట బడుల వేళల్లో మార్పు

రాష్ట్రంలో ఒంటిపూట బడుల వేళల్లో మార్పు

ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడుల వేళల్లో మార్పు చేసింది. ప్రస్తుతం ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు క్లాసులు కొనసాగుతున్నాయి. అయితే రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉదయం 8గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే స్కూళ్లు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ సమయమే కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలల వేళల్లో మార్పులు చేసింది.

మరిన్ని వార్తల కోసం..

ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి

ప్రభుత్వ వాహనాలకు కూడా స్టిక్కర్లు తీసేయాలి